రైతు హామీలను అమలు చేయాలి : వాసాల రమేశ్​

రైతు హామీలను అమలు చేయాలి :  వాసాల రమేశ్​

కొత్తపల్లి, వెలుగు : రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ  నాయకుడు వాసాల రమేశ్​ డిమాండ్​ చేశారు. కొత్తపల్లి పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్​లో బీజేపీ పట్టణ అధ్యక్షుడు కెంచ శేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.  ఇటీవల  వర్షానికి ఐకేపీ సెంటర్​లో ఉన్న వడ్లు తడిసి ముద్దాయ్యాయని, తడిసిన ధాన్యాన్ని తాలు, తరుగు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. 

ప్రతి క్వింటాల్​కు రూ.500 బోనస్, రైతు కూలీలకు రూ.12 వేలు, రుణమాఫీ రూ.2 లక్షలు వెంటనే అమలు చేయాలన్నారు.   కార్యక్రమంలో బీజేపీ జిల్లా దళిత మోర్చా కార్యదర్శి ఎర్రోళ్ల ప్రదీప్, బీజేపీ ప్రధాన కార్యదర్శి కొప్పుల హరిప్రసాద్, కిసాన్​మోర్చా అధ్యక్షుడు ఉమ్మెంతల లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.