మాజీ ఎంపీపీని పరామర్శించిన వివేక్ వెంకటస్వామి

మాజీ ఎంపీపీని పరామర్శించిన వివేక్ వెంకటస్వామి

వెల్గటూర్ మాజీ ఎంపీపీ, బీజేపీ రాష్ట్ర నేత ఎండీ బషీర్ కుటుంబాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఇటీవల బషీర్ తండ్రి నాజర్ మహమ్మద్ అనారోగ్యంతో మృతి చెందారు. ఇవాళ బషీర్ కుటుంబాన్ని కలిశారు. ముందుగా నాజర్ చిత్రపటానికి వివేక్ వెంకటస్వామి పూలమాలలు వేసి నివాళులర్పించి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర దళిత మోర్చ అధికార ప్రతినిధి కాడే సూర్యనారాయణ,పెద్దపల్లి సీనియర్ నాయకులు గొంటి ముక్కల సురేష్ రెడ్డి,వినుకొండ శ్రీధర్ పటేల్,పోనుగోటి రాంమోహన్ రావు, జాడి రాజేశం పాల్గొన్నారు.