
- చార్మినార్ జోనల్ ఆఫీస్ ముందు కార్పొరేటర్, బీజేపీ లీడర్ల ధర్నా
హైదరాబాద్ సిటీ, వెలుగు: సింగరేణి వాంబే క్వార్టర్స్ లో సీసీ రోడ్డు వేయకుండానే రూ.10 లక్షల బిల్లులు కాజేసిన కాంట్రాక్టర్ పై, శాంక్షన్చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఐఎస్సదన్డివిజన్కార్పొరేటర్జంగం శ్వేత డిమాండ్చేశారు. గురువారం బీజేపీ నాయకులతో కలిసి చార్మినార్ జోనల్ ఆఫీస్వద్ద ధర్నాకు దిగారు. అవినీతికి పాల్పడ్డ సంతోశ్నగర్ సర్కిల్ లోని క్వాలిటీ చెకింగ్ అధికారులను సస్పెన్షన్ చేయాలని, కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. కాజేసిన ప్రజా సొమ్ముని రికవరీ చేయాలన్నారు. కార్పొరేటర్లు ఆలే భాగ్యలక్ష్మి, బొక్క భాగ్యలక్ష్మి, కొత్తకాపు అరుణ, బీజేపీ నేతలు పాల్గొన్నారు.
మనీ అందాక స్కామర్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. మోసపపోయానని తెలుసుకున్న బాధితుడు ఆన్లైన్ద్వారా సైబర్క్రైఐమ్పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తం రూ.2,69,530 పోగొట్టుకున్నట్లు పేర్కొన్నాడు. కేసు ఫైల్చేసినట్లు సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.