యూపీలో ఎన్నికల హడావుడి కనిపిస్తోంది. జోరుగా నాయకులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే తాజాగా ఓమంత్రి నామినేషన్ వేసే సమయానికి ఆలస్యం అయ్యారు. దీంతో పరుగులు పెట్టారు. ఈ ఘటన యూపీలోని బల్లియా కలెక్టరేట్ వద్ద జరిగింది. ఉత్తరప్రదేశ్ క్రీడల మంత్రి ఉపేంద్ర తివారీ నామినేషన్ దాఖలు చేయడానికి ఆలస్యం కావడంతో బల్లియాలోని కలెక్టరేట్ కార్యాలయానికి పరుగెత్తారు. నిన్ననితో అక్కడ నామినేషన్ల గడువు ముగిసింది. నామినేషన్లు మధ్యాహ్నం 3 గంటలతో ముగిసాయి.అయితే అప్పటికే టైం కావడంతో మంత్రిఉపేంద్ర తివారీ నామినేషన్ వేసేందుకు పరుగులు తీశారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, నామినేషన్ ప్రక్రియ ముగియడానికి మూడు నిమిషాల సమయం ఉండగానే రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యతలు) తివారీ కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకున్నారు. బల్లియా జిల్లాలోని ఫెఫ్నా అసెంబ్లీ స్థానం నుంచి తివారీని భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటించింది.
#WATCH | UP Sports Minister Upendra Tiwari sprinted to Collectorate Office in Ballia y'day as he was running late to file his nomination. Y'day nominations were scheduled to be filed by 3 pm & the minister was running late, nomination process still ongoing#UttarPradeshElections pic.twitter.com/99HSIPHwoA
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 5, 2022
ఇవి కూడా చదవండి: