బీజేపీకి అవకాశం ఇవ్వండి.. బంగారు తెలంగాణ చేసి చూపిస్తం : రాజాసింగ్

  బీజేపీకి అవకాశం ఇవ్వండి.. బంగారు తెలంగాణ చేసి చూపిస్తం  :  రాజాసింగ్

బంగారు తెలంగాణ అని చెప్పి సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేశారని గోషామహల్  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.  బంగారు తెలంగాణ అని చెప్పి రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాలు చేశారని విమర్శించారు.  ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని కోరారు. కరీంనగర్ లో రాజాసింగ్   ప్రెస్ మీట్ నిర్వహించారు.   డబుల్ ఇంజన్  సర్కారున్న చోట డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పారు. 

బీజేపీకి ఒకసారి అవకాశం ఇస్తే బంగారు తెలంగాణను చేసి చూపిస్తామన్నారు. తెలంగాణలో ఎక్కడా చూసిన అవినీతినే జరుగుతుందన్న రాజాసింగ్..   బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దే దించాలన్నారు. బండి సంజయ్ ను కరీంనగర్ ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.  అందరి ఆశీర్వాదంతో తాను మళ్లీ పార్టీ లోకి వచ్చానని,  తనకు ఫస్ట్ లిస్టులోనే చోటు  దక్కి్ందని తెలిపారు.