
- అందరి జాతకంబయటపెట్టి పోతా
హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు బీజేపీ అధిష్టానం నోటీసులు ఇవ్వనుందని మీడియాలో వస్తున్న వార్తలపై సోమవారం స్పందించారు. “ నాకు నోటీసులు ఇచ్చేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నదని చానళ్లలో వార్తలు వస్తున్నాయి. ఒక వేళ ఇది నిజమైతే నోటీసు కాదు.. ఏకంగా సస్పెండ్ చేయండి” అని సవాల్ విసిరారు.
అటీటు కానోళ్లతో కలిసి పార్టీని బలోపేతం చేయలేమన్నారు. ధర్నా చేయలేమని, గవర్నమెంట్ తీసుకురాలేమని చెప్పారు. ‘‘ఒకవేళ నన్ను సస్పెండ్ చేస్తే పార్టీకి ఎవరి వల్ల నష్టం జరిగిందనే నిజాలు చెప్తా. అందరి జాతకం ప్రజల ముందు పెట్టి వెళ్తా” అని హెచ్చరించారు. కాగా, ఇటీవల గోరక్షణ కోసం మాట్లాడుతుంటే తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ తెలిపారు. ఫోన్లలో కాదని.. దమ్ముంటే ఎదురుగా వచ్చి కొట్లాడాలని సవాల్ చేశారు. ధర్మం కోసం చంపడానికైనా.. చావడానికైనా తాను సిద్ధమని చెప్పారు.