![బీజేపీ అగ్ర నేతలను కలిసిన కొత్త ఎమ్మెల్యేలు](https://static.v6velugu.com/uploads/2023/12/bjp-mlas-payal-shankar-and-alleti-maheshwar-reddy-who-recently-won-in-joint-adilabad-district-met-top-leaders-of-party-politely_DIU0WCE2nj.jpg)
నిర్మల్/ ఆదిలాబాద్ టౌన్: ఉమ్మడి ఆదిలాబాద్జిల్లాలో ఇటీవల గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్శంకర్, ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆ పార్టీ అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం ఢిల్లీలో తరుణ్ చుగ్, బీఎల్ సంతోష్ తోపాటు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిశారు.
ఈ సందర్భంగా వారిని అగ్ర నేతలు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వారితో చర్చించినట్లు పేర్కొన్నారు.