బండి సంజయ్ను పరామర్శించిన బీజేపీ నేతలు

బండి సంజయ్ను పరామర్శించిన బీజేపీ నేతలు

జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న బండి సంజయ్ ను బీజేపీ నాయకులు కరీంనగర్ కు పరామర్శించారు. జైలులో ఉన్న ఆయనతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్  ములాఖత్ అయ్యారు. దాదాపు అర గంట పాటు బండి సంజయ్‌తో సమావేశమయ్యారు. జాగరణ కార్యక్రమం సమయంలో అరెస్టు చేసిన తీరు, ఆ తర్వాత జరిగిన పరిణామాలను ఆయనను అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. తదుపరి బండి సంజయ్ కుటుంబ సభ్యులను నేతలు పరామర్శించనున్నారు.

కాగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో నడ్డాకు బీజేపీ నేతలు స్వాగతం పలకనున్నారు. బండి సంజయ్ అరెస్టు, తర్వాత పరిణామాలను నడ్డాకు వివరించనున్నారు. అక్కడ బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి జేపీ నడ్డా మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సాయంత్రం.. సికింద్రాబాద్ లోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీలో నడ్డా పాల్గొననున్నారు. 

రాష్ట్రవ్యాప్త నిరసనలు

ఇకపోతే, బండి సంజయ్ అరెస్ట్ తో రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీజేపీ నాయకత్వం పిలుపునిచ్చింది. 14 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపడతామని నేతలు చెప్పారు. ఇవాళ జిల్లా, మండల కేంద్రాల్లో నల్ల  బ్యాడ్జీలతో నిరసన చేపట్టనున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే నిరసన కార్యక్రమంలో పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారు. 

మరిన్ని వార్తల కోసం: 

50 శాతం సెంట్రల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

పంజాబ్‌లో స్కూళ్లు, కాలేజీలు క్లోజ్

ఒత్తిడి నుంచి బయటపడడానికి ఏం చేయాలంటే..