నేను కృష్ణుడి గోపికను .. బీజేపీ ఎంపీ హేమ మాలిని ప్రకటన

నేను కృష్ణుడి గోపికను .. బీజేపీ ఎంపీ హేమ మాలిని ప్రకటన

మథుర: బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని  తనను శ్రీకృష్ణుడికి  గోపికగా ప్రకటించుకున్నారు. యూపీలోని మథుర నుంచి మూడోసారి బ్రిజ్వాసీలకు సేవ చేసేందుకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

తాను పేరు కోసమో, కీర్తి కోసమో, భౌతిక లబ్ధి కోసమో రాజకీయాల్లోకి రాలేదన్నారు. శ్రీకృష్ణుడు బ్రిజ్వాసీలను ప్రేమిస్తాడు కాబట్టి, వారికి సేవ చేస్తే స్వామి ఆశీస్సులు తనపై ఉంటాయని భావిస్తున్నానని చెప్పారు. ‘బ్రాజ్‌‌ 84 కోస్‌‌ పరిక్రమ’ అభివృద్ధికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. యమునా నది ప్రక్షాళనకు కృషి చేయడం తన రెండవ ప్రాధాన్యత అని ఆమె పేర్కొన్నారు.