‘కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ప్రజలు నమ్మరు : డీకే అరుణ

‘కాంగ్రెస్, బీఆర్ఎస్ లను ప్రజలు నమ్మరు : డీకే అరుణ

గద్వాల, వెలుగు : ఎన్నికలు వచ్చినప్పుడే స్కీములు గుర్తుకొస్తున్నాయని, ఓట్ల కోసం అబద్దాలు చెప్పే బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్లను ప్రజలు నమ్మరని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. మంగళవారం ఇంటింటికీ బీజేపీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ, గంటగేరి కాలనీల్లో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి బీజేపీ అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. 

గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్  ఎన్నో హామీలిచ్చి ఓట్లు దండుకొని మోసం చేశారన్నారు. మళ్లీ తప్పుడు హామీలతో వస్తున్నాడని చెప్పారు. కాంగ్రెస్  పార్టీ సాధ్యం కాని హామీలిస్తూ ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. గడ్డం కృష్ణారెడ్డి, రామాంజనేయులు, బండల వెంకట్రాములు, బండల పద్మావతి, కృష్ణవేణి, రజక జయశ్రీ, కబీర్​దాస్ నర్సింలు, రవికుమార్, అనిత పాల్గొన్నారు.