కాంగ్రెస్ అమ్ముడు పోయే పార్టీ.. బీఆర్ఎస్ కొనుగోలు చేసే పార్టీ : డీకే అరుణ

కాంగ్రెస్ అమ్ముడు పోయే పార్టీ.. బీఆర్ఎస్ కొనుగోలు చేసే పార్టీ : డీకే అరుణ

గద్వాల, వెలుగు : కాంగ్రెస్ అమ్ముడు పోయే పార్టీ అని.. బీఆర్ఎస్ కొనుగోలు చేసే పార్టీ అని  బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ అన్నారు. బుధవారం గద్వాలలోని బంగ్లాలో 31 వ వార్డు కేటి దొడ్డి మండలం కుచినేలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన వారు బీజేపీలో చేరగా వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ రెండు పార్టీలతో తెలంగాణకు నష్టమేనన్నారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మొత్తం అమ్మేస్తారన్నారు.

తాను గద్వాలలో ఉండదన్న సన్నాసుల పళ్లు రాలగొడతానని ఘాటుగా హెచ్చరించారు. బీజేపీ అభ్యర్థి బలిగెరా శివారెడ్డిని గెలిపించాలని కోరారు.  కార్యక్రమంలో రామాంజనేయులు, బలిగెరా శివారెడ్డి, పాల్వాయి రాముడు, వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు.