బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ నోవాటెల్ లో శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. వీటిని ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభించారు. ఈసందర్భంగా ప్రధాని మోడీని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సత్కరించారు. ఈ సమావేశాల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఆదివారం సాయంత్రం వరకు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగనున్నాయి.