మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ ఫోకస్..పదాధికారుల సమావేశం

మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ ఫోకస్..పదాధికారుల సమావేశం

మునుగోడు ఉపఎన్నికపై బీజేపీ ఫోకస్ పెట్టింది. పార్టీ ఆఫీసులో స్టేట్ ఆఫీస్ బేరర్స్ మీటింగ్  ప్రారంభమైంది. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జిలు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, అరవింద్ మీనన్, మునుగోడు ఉప ఎన్నిక స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఇతర పదాధికారులు పాల్గొన్నారు. మునుగోడు ఉపఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు. 

రేపు మెదక్ జిల్లా నర్సాపూర్లో బహిరంగ సభ ఉంది. దీనికి సంబంధించిన అంశాలపై కూడా మీటింగ్ లో చర్చించనున్నారు. రేపటి బహిరంగ సభకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ తో పాటు తరుణ్ చుగ్, సంజయ్, లక్ష్మణ్ హాజరుకానున్నారు. ఈ సభలో నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, పరకాల మాజీ ఎమ్మెల్యే బిక్షపతి బీజేపీలో చేరనున్నారు.