మూడు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ ఛార్జులను ప్రకటించిన బీజేపీ..

మూడు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ ఛార్జులను ప్రకటించిన బీజేపీ..

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పార్టీ ప్లాన్ చేస్తుంది. ప్రతిపక్ష పార్టీల కన్న ముందే ఎంపీ క్యాండిడేట్లను ప్రకటిస్తూ దూసుకెళ్తుంది. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ మూడు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ ఛార్జ్ లను నియమించింది. 

ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, హరియాణా రాష్ట్రాలకు నూతన ఇన్ ఛార్జ్ లను నియమిస్తున్నట్టు కమలం హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బీజేపీ ఇన్ ఛార్జ్ లు గా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ లను నియమించింది. అరుణ్ సింగ్ ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ రాజ్యసభ ఎంపీగా... సిద్ధార్థ్ సింగ్ పార్టీ సభ్యుడిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.