
హైదరాబాద్, వెలుగు : వచ్చే నెల 4, 5, 6 తేదీల్లో అన్ని జిల్లాల్లో సభ్యత్వ స్వీకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తెలిపారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో ఆయన మాట్లా డారు. సెప్టెంబరు 3న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు.
ఆ తర్వాతి మూడు రోజులు ఎస్సీ మోర్చా మెంబర్ షిప్ నిర్వహిస్తామన్నారు. మండలానికి వెయ్యి, జిల్లాకు 10 వేల చొప్పున, రాష్ట్రంలో 3.80 లక్షల సభ్యత్వాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు.