ఎన్నికలప్పుడే పాలిటిక్స్.. తర్వాత అభివృద్ధే.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

ఎన్నికలప్పుడే పాలిటిక్స్.. తర్వాత అభివృద్ధే.. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్, వెలుగు: ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉంటాయని, ఆ తరువాత  ప్రజాప్రతినిధులు అభివృద్ధిపై ఫోకస్​ పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్ అన్నారు. వికారాబాద్​ నియోజకవర్గంలో సర్పంచ్​లు, వార్డుమెంబర్లుగా గెలిచిన వారు సోమవారం ఆయనను క్యాంప్​ఆఫీస్​లో కలిశారు. ఈ సందర్భంగా వారిని స్పీకర్ శాలువాలతో సన్మానించారు. పదవీ బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించి ప్రజల నమ్మకాన్ని  నిలబెట్టాలని  సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు రాజశేఖర్​రెడ్డి, శంకర్, నాయకులు చీమలదరి నరోత్తంరెడ్డి, వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు.