గవర్నర్​ను అవమానిస్తూ వ్యాసాలా? : బీజేపీ

గవర్నర్​ను అవమానిస్తూ వ్యాసాలా? : బీజేపీ
  • గవర్నర్​ను అవమానిస్తూ వ్యాసాలా?
  • కేసీఆర్ ​చీఫ్ ​పీఆర్వోపై బీజేపీ ఆగ్రహం

హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వైపు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు స్వాగతం పలుకుతూనే.. మరోవైపు తన చీఫ్​పీఆర్వోతో గవర్నర్ ను అవమానించేలా వ్యాసాలు రాయించారని బీజేపీ రాష్ట్ర శాఖ మండిపడింది. గవర్నర్ నియామకాన్ని అవమానించేలా ‘గవర్నర్​కు సంబంధించిన ఆధునిక కాలపు జిమ్మిక్కులు’ శీర్షికతో ఓ ఇంగ్లిష్‌‌ న్యూస్‌‌పేపర్‌‌లో ముఖ్యమంత్రి సీపీఆర్వో వనం జ్వాలా నరసింహారావు రాసిన వార్త దేనికి సంకేతమని  బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు ప్రశ్నించారు. సోమవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసినరోజే ఈ వార్తను రాయించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ కుట్రేనని, దీనిపై‌‌‌‌ ముఖ్యమంత్రి కేసీఆర్ వివరణ ఇస్తూ.. వెంటనే గవర్నర్ కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.