మోడీ హయాంలోనే గ్రామాల అభివృద్ధి

మోడీ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
  • బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి 

జోగిపేట, వెలుగు : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎం. నరేందర్ రెడ్డి అన్నారు. శనివారం అందోల్​–జోగిపేట మున్సిపల్ పరిధిలో.. తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో అందుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో భాగంగా వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మహేందర్, జిల్లా, మండల విస్తారిక్ రాయప్ప గౌడ, జిల్లా నాయకులు జగన్నాథం, కొత్త శ్రీనివాస్, పట్టణ పార్టీ  అధ్యక్షుడు సాయి కృష్ణ పాల్గొన్నారు.