చెదరగొట్టిన పోలీసులు
జనగామ, వెలుగు: జనగామలో బీజేపీ, టీఆర్ఎస్ లీడర్ల మధ్య మళ్లీ లొల్లి జరిగింది. బుధవారం టీఆర్ఎస్చేసిన దాడులను ఖండిస్తూ బీజేపీ మౌన దీక్షకు పిలుపునివ్వగా పోలీసులు పర్మిషన్ఇవ్వలేదు. అయితే గురువారం ఉదయం బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్రెడ్డి, సౌడ రమేశ్, గండి నాగరాజు తదితరులు జనగామ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. అప్పటికే అక్కడ రెడీగా ఉన్న టీఆర్ఎస్ లీడర్లు ఒక్కసారిగా బీజేపీ లీడర్ల వైపు దూసుకొచ్చారు. మోడీ డౌన్డౌన్అంటూ నినాదాలతో హోరెత్తించారు. జనగామ టౌన్, రూరల్ సీఐలు బాలాజీ వరప్రసాద్, వినయ్కుమార్ బలగాలతో ఇరువర్గాలను చెదరగొట్టారు. పెనుగులాటలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దశమంత్రెడ్డి కిందపడిపోయారు. మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు చౌరస్తాకు చేరుకుని పార్టీ శ్రేణులకు సంఘీభావం తెలిపారు. అనంతరం పోలీసులు బీజేపీ శ్రేణులను పార్టీ జిల్లా ఆఫీస్కు తరలించారు. కాసేపటి తర్వాత అక్కడి నుంచి ముందస్తు అరెస్టులు చేస్తూ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు.
ఎక్కడికక్కడ అరెస్టులు
జనగామలో శుక్రవారం సీఎం పర్యటన నేపథ్యంలో గురువారం బీజేపీ లీడర్లను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 500 మంది కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి చెప్పారు. తనను హౌజ్ అరెస్ట్ చేశారని అన్నారు. జనగామ జిల్లా హాస్పిటల్లో ట్రీట్మెంట్తీసుకుంటున్న 9 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు హైదరాబాద్కు తరలించినట్లు చెప్పారు. పోలీసులు అరెస్ట్ చేసిన తమ లీడర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లింగాలఘన్పూర్ మండల కేంద్రంలో బీజేపీ యువమోర్చా లీడర్ అంజి సాయంత్రం సెల్ టవర్ఎక్కి నిరసన తెలిపాడు. బీజేపీ లీడర్లు, పోలీసులు అతడికి సర్దిచెప్పడంతో 2 గంటల తర్వాత కిందకు దిగాడు.
నర్మెట్టలో బీజేపీ లీడర్లపై దాడి
బచ్చన్నపేట, వెలుగు: జనగామలో బుధవారం బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని నిరసిస్తూ నర్మెట్ట మండల కేంద్రంలో గురువారం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేశారు. విషయం తెలిసి అక్కడకు వచ్చిన టీఆర్ఎస్ కార్యకర్తలు జెండా కర్రలతో దాడి చేయడంతో బీజేపీ మండల అధ్యక్షుడు ధరావత్రాజునాయక్, వెల్దండ గ్రామ బూత్అధ్యక్షుడు శాచెల్లి రాజు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు బచ్చన్నపేట సర్కార్ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి తలలకు బలమైన గాయాలవడంతో డాక్టర్లు కుట్లు వేశారు. హనుమకొండ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ జనగామ జిల్లా అధ్యక్షులు ఆరుట్ల దశమంతరెడ్డి, నాయకులు ఏవీఎల్ఎన్రెడ్డి, ముక్కెర తిరుపతిరెడ్డి సహా పలువురు బచ్చన్నపేట ఆసుపత్రికి చేరుకుని గాయపడినవారిని పరామర్శించారు. గాయనపడిన వారిని మెరుగైన ట్రీట్మెంట్కోసం గాంధీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. దాడికి గురైనవారు అక్కడే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
మరిన్ని వార్తల కోసం :