కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు- ఇద్దరు మృతి

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు- ఇద్దరు మృతి

కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగింది. బొబ్బిలి పారిశ్రామిక వాడలోని బాలాజీ కెమికల్ ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా బాయిలర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బొబ్బిలి మండలానికి చెందిన సురేష్, జగదీశ్ లు మృతి చెందగా మరో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.