నాసిక్: మహారాష్ట్ర నాసిక్లోని ముండేగావ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జిందాల్ గ్రూప్ పాలిథీన్ తయారీ యూనిట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో ఇద్దరు చనిపోగా.. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. కెమికల్ ప్లాంట్ బాయిలర్లో పేలుడుతో మంటలు చెలరేగాయి. పలువురు కార్మికులు ఫ్యాక్టరీలో చిక్కుకుపోయారు. ఫైరింజన్లతో అధికారులు మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.
ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. 19 మందిని కాపాడినట్టు వెల్లడించారు. 17 మందిని దగ్గర్లోని హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ ఇస్తున్నామన్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, ఇద్దరు చనిపోయారనివెల్లడించారు. సహాయక చర్యల కోసం నాసిక్ జిల్లాలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి హెలికాఫ్టర్ ను తెప్పించామని వివరించారు. న్యూ ఇయర్ కావడంతో ఫ్యాక్టరీలో చాలా తక్కువ మంది పనికొచ్చారని సీనియర్ అధికారి తెలిపారు.