మందమర్రి ప్రభుత్వ స్కూల్కు డ్యూయల్ డెస్క్ల అందజేత

మందమర్రి ప్రభుత్వ స్కూల్కు డ్యూయల్ డెస్క్ల అందజేత

కోల్​బెల్ట్, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాల కల్పనకు బ్లూ డాన్ ​సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని మంచిర్యాల డీఈవో యాదయ్య అన్నారు. హైదరాబాద్​కు చెందిన బ్లూ డాన్ ​ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో గురువారం మందమర్రి పట్టణం ఒర్రెగడ్డ ఏరియాలోని జడ్పీ బాయ్స్​హైస్కూల్​కు సుమారు రూ.3లక్షల విలువైన 50 డ్యూయల్ ​డెస్క్ ​బెంచీలను ఏరియా సింగరేణి జీఎం జి.దేవేందర్​తో కలిసి డీఈవో అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇలాంటి సేవా కార్యక్రమాలు ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేలా దోహదపడుతాయన్నారు. కార్యక్రమంలో మందమర్రి మున్సిపల్​కమిషనర్ ​తుంగపిండి రాజలింగు, సింగరేణి పర్సనల్​ మేనేజర్ ​శ్యాంసుందర్, ఎంఈవో దత్తుమూర్తి, స్కూల్ హెచ్​ఎం పద్మజ, బ్లూడాన్​ సంస్థ ప్రతినిధులు విదుమౌళి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

విద్యార్థులకు బ్యాగుల అందజేత

రామకృష్ణాపూర్ ​సింగరేణి ఠాగూర్​ స్టేడియం ఏరియాలోని ప్రభుత్వ ప్రైమరీ స్కూల్​లోని 40 మంది విద్యార్థులకు ‘యువత.. జనం కోసం’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్కూల్​బ్యాగులను క్యాతనపల్లి మున్సిపల్​కమిషనర్ ​గద్దె రాజు అందజేశారు. సంస్థ అధ్యక్షుడు ఎర్రబెల్లి రాజేశ్, వెరైటీ తిరుపతి, కరుణాకర్, గణేశ్​ పాల్గొన్నారు.