
హైదరాబాద్, వెలుగు: సిటీకి చెందిన హెల్త్-టెక్ కంపెనీ బ్లూసెమీ కేవలం నిమిషంలో ఆరు వైటల్స్ను చెక్ చేయగల డివైజ్ ‘ఈవా’ను లాంచ్ చేసింది. దీనిపై రెండు వేళ్లు పెట్టగానే ఎలక్ట్రో కార్డియోగ్రామ్(ఈసీజీ), హార్ట్రేట్, రక్తపోటు, ఆక్సిజన్ లెవెల్స్, బ్లడ్ గ్లూకోజ్, హెచ్ఏ1సీలను చెక్చేస్తుంది. ఇందుకోసం డివైజ్ను ఈవా మొబైల్ యాప్కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సెన్సర్ ఫ్యూజన్, ఏఐ అల్గారిథమ్లు, ఐఓటీలతో (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఇది పనిచేస్తుంది. ఆరు వైటల్స్లో ఏదైనా పరిమితికి మించి ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యాప్ వివరిస్తుంది.
భారతదేశంలో ఈవా ధర రూ. 16,650 కాగా, ఎర్లీబర్డ్ ఆఫర్ కింద రూ.15,500లకు అందజేస్తున్నామని బ్లూసెమీ సీఈఓ సునీల్ మద్దికట్ల చెప్పారు. టీ–హబ్లో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘2017లో ఏర్పాటైన బ్లూసెమీకి టీ–హబ్, -హైదరాబాద్ ఐఐటీ, నాస్కామ్ నుంచి మద్దతు లభించింది. డీఎస్టీ, మైటీ నుంచి కూడా నిధులు అందాయి. త్వరలో 69 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 510 కోట్లు) సేకరించనున్నాం. మరిన్ని నిధుల కోసం రాబోయే రెండేళ్లలో ఐపీఓకి కూడా వస్తాం. ఈ డివైజ్ను బెంగళూరు, ఢిల్లీ, అహ్మదాబాద్లోని అసెంబ్లింగ్ ప్లాంట్లలో తయారు చేస్తున్నాం. ఇప్పటికే 1,800 డివైజ్లను అమ్మాం. వీటికి విపరీతంగా గిరాకీ ఉంది. ఈ ఏడాది 70 వేల యూనిట్లు అమ్మాలని టార్గెట్గా పెట్టుకున్నాం. ఈవా ఇచ్చే రిజల్ట్స్ 90 శాతం కచ్చితత్వంతో ఉంటాయి. అయితే ఇది మెడికల్ గ్రేడ్ డివైజ్ కాదు”అని ఆయన వివరించారు.