- కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాష్కీని కోరిన బోర్డు డైరెక్టర్ దానకిశోర్
హైదరాబాద్, వెలుగు : వాటర్ బోర్డు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని బోర్డు డైరెకర్ట్ దానకిశోర్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం వాటర్బోర్డు ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీని కలిసిన దానకిశోర్ వాటర్ బోర్డు ఉద్యోగుల సమస్యల గురించి ఆయనకు వివరించారు.
ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. వాటర్బోర్డులో దాదాపు వెయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వాటి భర్తీకి కృషి చేస్తానన్నారు.
ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తానని ఆయన చెప్పారు.మధుయాష్కీని కలిసిన వారిలో వాటర్ బోర్డు ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు సతీశ్కుమార్, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర రాజ్, అల్లి శ్రవణ్కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఆనంద్ రెడ్డి, రాజ్ తదితరులు ఉన్నారు.