ఎరువుల నిల్వలపై బోర్డులు పెట్టాలి.. ఏ ఫర్టిలైజర్ షాపులో ఎంత ఉందనేది తెలిసేలా ఏర్పాటు చేయాలి

ఎరువుల నిల్వలపై బోర్డులు పెట్టాలి..  ఏ ఫర్టిలైజర్ షాపులో ఎంత ఉందనేది తెలిసేలా ఏర్పాటు చేయాలి

పరిగి, వెలుగు: యూరియా నిల్వలు ఉన్నట్లు అధికారులు చెప్తున్న దాంట్లో వాస్తవం లేదని రైతులు ఆరోపించారు. యూరియా ఏ ఫర్టిలైజర్​షాపులో ఎంత ఉందనేది తెలిసేలా మండల వ్యవసాయ అధికారి కార్యాలయం ఎదుట బోర్డులు పెట్టాలని డిమాండ్​చేశారు. మంగళవారం దోమ మండల కేంద్రంలోని ఆగ్రోస్​షాపు ఎదుట యూరియా కోసం క్యూలైన్​లో బారులుదీరారు.  

పరిగి నియోజకవర్గంలోని పరిగి, దోమ, కుల్కచర్ల, చౌడాపూర్​ మండలాల రైతులందరం వ్యవసాయ పనులు పక్కన పెట్టి ప్రతీరోజు యూరియా కోసం తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  వ్యవసాయ అధికారులు కార్యాలయాల్లో అందుబాటులో ఉండటం లేదని, ఫోన్​చేస్తే ఎత్తడం లేదని వాపోయారు.