
పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న క్రేజీ ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో దీనికోసం బాలీవుడ్ నుంచి కూడా యాక్టర్స్ని రంగంలోకి దింపుతున్నాడు క్రిష్. తాజాగా బాబీ డియోల్ ఎంట్రీ ఇచ్చినట్టు అనౌన్స్ చేశారు. ఆయన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్ర పోషిస్తున్నట్టు రివీల్ చేశారు. షూటింగ్లో జాయిన్ అవడానికి శనివారమే హైదరాబాద్ చేరుకున్నాడు బాబీ డియోల్. కీలకమైన ఈ షెడ్యూల్ కోసం ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి 17వ శతాబ్దానికి చెందిన భారీ దర్బార్ సెట్ను రూపొందించారు.
పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను ఈ సెట్లోనే షూట్ చేయనున్నారు. బాబీ డియోల్కి వెల్కమ్ చెబుతూ ‘హరి హర వీర మల్లు’ టీమ్ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. అందులో బాబీ లుక్ ఆకట్టుకుంటోంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో విర్క్, డానిష్, భరత్ భాటియా, నాజర్, రఘుబాబు, నర్రా శ్రీను, సునీల్, సుబ్బరాజు, నోరా ఫతేహి, అనసూయ, పూజిత పొన్నాడ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.