గవర్నమెంట్ ​స్కూళ్లపై నమ్మకం పెంచాలి : సుదర్శన్​రెడ్డి

గవర్నమెంట్ ​స్కూళ్లపై నమ్మకం పెంచాలి : సుదర్శన్​రెడ్డి
  •     బోధన్​ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి

బోధన్, వెలుగు : గవర్నమెంట్​ స్కూళ్లలో పనిచేసే టీచర్లు స్టూడెంట్స్​కు నాణ్యమైన విద్యనందించి, తల్లిదండ్రుల నమ్మకాన్ని పొందాలని బోధన్​ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్​రెడ్డి పేర్కొన్నారు. బోధన్​లోని ఆయేషా గార్డెన్​లో శుక్రవారం పీఆర్టీయూ యూనియన్​ టీచర్ల డైరీని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గవర్నమెంట్​ స్కూళ్లలో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని

ప్రభుత్వ బడుల్లో పనిచేసే టీచర్లపై నమ్మకం లేకే పేరేంట్స్​ ప్రైవేట్​బడులను ఆశ్రయిస్తున్నారన్నారు. అనంతరం నియోజకవర్గంలోని 269 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్​చెక్కులు అందజేశారు. బోధన్, ఎడపల్లి ఎమ్మార్వోలు గంగాధర్, మోతీసింగ్, ఎంపీడీవోలు పాల్గొన్నారు.

ఎడపల్లి : గ్రామాల్లో విచ్చలవిడిగా నడుస్తోన్న మద్యం బెల్ట్​షాప్​లను, గంజాయి దందాను అరికట్టాలని ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి ఎక్సైజ్, పోలీస్​అధికారులను ఆదేశించారు.​ శుక్రవారం ఆయన మండలంలోని జానకంపేట్, టానా కలాన్, కుర్నాపల్లి, మంగల్​పాడ్, అంబం, బ్రాహ్మణ్​పల్లి, జైతాపూర్​తదితర గ్రామాల్లో పర్యటించారు.ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. ముందుగా జానకంపేట్​లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన సుదర్శన్​రెడ్డి తర్వాత టానాకలాన్​లో ప్రైమరీ స్కూల్​ను తనిఖీ చేశారు.

స్కూల్​హెడ్​మాస్టర్​ లాటరీ పేరుతో స్టూడెంట్స్​నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని పేరెంట్స్​కంప్లైంట్​ చేయగా హెచ్ఎమ్​పై సీరియస్​అయ్యారు. అనంతరం టానాకలాన్,​‌ ‌కుర్నాపల్లి, వయా మంగల్​పాడ్ ​మీదుగా వెళ్లే ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. కుర్నాపల్లి హైస్కూల్​ను సందర్శించి స్టూడెంట్స్​తో మాట్లాడారు. ఎడపల్లిలో ఎక్సైజ్, పోలీస్​అధికారులతో మీటింగ్​ నిర్వహించారు. ​పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి, మండలా ధ్యక్షుడు పులి శ్రీనివాస్, లీడర్లు తాహెర్​బిన్ ​హందాన్, బిల్లా రాంమోహన్, ఈరంటి లింగం పాల్గొన్నారు.