
బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ సంచలన కామెంట్స్ చేశారు. పెళ్లి తరువాత ఇద్దరి మధ్య ప్రేమ ఉండదని, ఇద్దరు మనస్ఫూర్తిగా ప్రేమించుకుంటే పెళ్లి అనేది దండగా అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, అతని భార్య ఆలియా విడాకుల తీసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. తనను అత్తవారింట్లో ఇబ్బందిపెడుతున్నారని, ఇంట్లోకి కూడా రానివ్వడం లేదని నవాజుద్దీన్ భార్య ఆలియా విడాకుల కోసం కోర్టువరకు వెళ్లారు. కానీ, తమ కూతురు జీవితం గురించి ఆలోచించిన ఈ జంట విడాకులను క్యాన్సిల్ చేసుకున్నారు.
ఇదే విషయం గురించి తాజాగా ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా నిజంగా ప్రేమించుకుంటే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకోకుండా కూడా ఆ ప్రేమను కంటిన్యూ చేయొచ్చు. పెళ్లి తరువాత ఒకరిపై ఒకరికి ఆధిపత్యం వస్తుంది. అదే పెళ్లి లేకపోతే ఇద్దరూ ప్రేమగా, ఆప్యాయంగా ఉండొచ్చు. పెళ్లి తరువాత వారిపై ఉన్న ప్రేమ రాను రానూ తగ్గిపోతుంది.. అంటూ చెప్పుకొచ్చాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.