ఎమ్మెల్యేగా ఓడిన దీదీ బెంగాల్‌ను పాలిస్తారా?

ఎమ్మెల్యేగా ఓడిన దీదీ బెంగాల్‌ను పాలిస్తారా?

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ చరిత్ర సృష్టించింది. దీదీ నాయకత్వంలోని టీఎంసీ 215 సీట్లు కైవసం చేసుకొని వరుసగా మూడోసారి  విజయం సాధించింది. అయితే రాష్ట్రాన్ని గెలుచుకున్న మమతా బెనర్జీ.. ఎమ్మెల్యేగా పోటీ చేసిన నందిగ్రామ్‌లో ఓటమి పాలయ్యారు. తన మాజీ అనుచరుడు, కుడిభుజంగా చెప్పుకునే సువేందు అధికారి (బీజేపీ) చేతిలో మమత ఓటమిని చవిచూశారు. ఈ విషయంపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్పందించింది. ఎమ్యెల్యేగా ఓడిన దీదీ.. రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారంటూ కంగన క్వశ్చన్ చేసింది. అందుకే రాజకీయాలంటే తనకు నచ్చడం లేదని తెలిపింది. 


‘బెంగాల్‌ తదుపరి సీఎం కనీసం ఎమ్యేల్యేగా గెలవలేకపోయారు. అందుకే నాకు రాజకీయాలంటే నచ్చవు. విశ్వసనీయత, ప్రజాస్వామ్యాన్ని సైంటిఫిక్‌గా చూసినంతవరకు ఇలాంటివి జరుగుతుంటాయి. ఇదో పెద్ద సర్కస్‌లా మారనుంది. ఎవరి చేతిలో కొరడా ఉంటే వారే రింగ్ మాస్టర్ అవుతారు. బతికి బయటపడ్డవారే నియంతలగా మారతారు’ అని దీదీని ఉద్దేశిస్తూ కంగన వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. బెంగాల్‌లో బీజేపీ చాలా వేగంగా  ఎదుగుతోందని తెలిపింది. 2001లో ఒక్క సీటూ లేని పొజిషన్ నుంచి ఇప్పుడు 75 సీట్లు గెల్చుకోవడం బీజేపీ బలాన్ని తెలియజేస్తోందని కంగన ట్వీట్ చేసింది. వీటన్నింటిని కంటే ముఖ్యంగా సీఎం మమతను ఓడించడం పెద్ద విశేషమని పేర్కొంది.