బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ చరిత్ర సృష్టించింది. దీదీ నాయకత్వంలోని టీఎంసీ 215 సీట్లు కైవసం చేసుకొని వరుసగా మూడోసారి విజయం సాధించింది. అయితే రాష్ట్రాన్ని గెలుచుకున్న మమతా బెనర్జీ.. ఎమ్మెల్యేగా పోటీ చేసిన నందిగ్రామ్లో ఓటమి పాలయ్యారు. తన మాజీ అనుచరుడు, కుడిభుజంగా చెప్పుకునే సువేందు అధికారి (బీజేపీ) చేతిలో మమత ఓటమిని చవిచూశారు. ఈ విషయంపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ స్పందించింది. ఎమ్యెల్యేగా ఓడిన దీదీ.. రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారంటూ కంగన క్వశ్చన్ చేసింది. అందుకే రాజకీయాలంటే తనకు నచ్చడం లేదని తెలిపింది.
That is why I don’t like politics, it is all very scientific as long as it is about credibility and democracy now that the CM is not even a MLA suddenly it’s all going to be a big circus,whoever will have the whip will be the ring master.
— Kangana Ranaut (@KanganaTeam) May 2, 2021
Eventually the SURVIVOR is the DICTATOR. https://t.co/fDa37BBGtR
‘బెంగాల్ తదుపరి సీఎం కనీసం ఎమ్యేల్యేగా గెలవలేకపోయారు. అందుకే నాకు రాజకీయాలంటే నచ్చవు. విశ్వసనీయత, ప్రజాస్వామ్యాన్ని సైంటిఫిక్గా చూసినంతవరకు ఇలాంటివి జరుగుతుంటాయి. ఇదో పెద్ద సర్కస్లా మారనుంది. ఎవరి చేతిలో కొరడా ఉంటే వారే రింగ్ మాస్టర్ అవుతారు. బతికి బయటపడ్డవారే నియంతలగా మారతారు’ అని దీదీని ఉద్దేశిస్తూ కంగన వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. బెంగాల్లో బీజేపీ చాలా వేగంగా ఎదుగుతోందని తెలిపింది. 2001లో ఒక్క సీటూ లేని పొజిషన్ నుంచి ఇప్పుడు 75 సీట్లు గెల్చుకోవడం బీజేపీ బలాన్ని తెలియజేస్తోందని కంగన ట్వీట్ చేసింది. వీటన్నింటిని కంటే ముఖ్యంగా సీఎం మమతను ఓడించడం పెద్ద విశేషమని పేర్కొంది.
BJP Growth in Bengal : -
— Kangana Ranaut (@KanganaTeam) May 2, 2021
2001-0
2006-0
2011-0
2016-3
2021 - 80+
Above all the chief minister lost her own seat.
we may have expected miracles but it’s not less than that, the growth is phenomenal for BJP ...
We need to build from here and earn #Bengal #BengalElections2021