సందీప్ను టార్గెట్ చేసిన బాలీవుడ్ మీడియా.. కావాలనే అలా చేస్తున్నారా?

సందీప్ను టార్గెట్ చేసిన బాలీవుడ్ మీడియా.. కావాలనే అలా చేస్తున్నారా?

టాలీవుడ్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeepreddy Vanga) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ యానిమల్(Animal). ఎమోషనల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 1న రిలీజై భారీ విజయాన్ని సాధించింది. బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. సినిమాకు సూపర్ హిట్ టాక్ రావడంతో ఎగబడి మరీ సినిమా చేస్తున్నారు. దీంతో రికార్డ్ కలెక్షన్స్ రాబడుతోంది. మొదటిరోజు ఏకంగా రూ.116 కోట్ల భారీ కలెక్షన్స్ ను రాబట్టి రణ్బీర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది యానిమల్ మూవీ.

నిజానికి యానిమల్ మూవీ పక్కా హిందీ మూవీ కానీ.. అన్నీ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగు మీడియా ఈ సినిమా అదిరిపోయే రేటింగ్ ఇచ్చింది. సినిమా సూపర్ అంటూ అదిరిపోయే ప్రమోషన్స్ చేసింది. కానీ హిందీ మీడియా మాత్రం యానిమల్ మూవీపై కావాలనే తక్కువ రేటింగ్ ఇచ్చింది. కారణం ఈ సందీప్ రెడ్డి వంగ తెలుగు దర్శకుడు అవడం. ఆ కారణంగా మంచి సినిమాకు సైతం కావాలను తక్కకు రేటింగ్ ఇచ్చి సందీప్ కు నెగిటీవ్ వచ్చేలా చేస్తున్నారు. ఈ విషయంలో సందీప్ ను కావాలనే హిందీ మీడియా టార్గెట్ చేస్తుంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

నిజానికి హిందీ ఆడియన్స్ నుండి కూడా యానిమల్ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. సినిమా నెక్స్ట్ లెవల్లో ఉంది అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. కానీ హిందీ మీడియా మాత్రం 1.5, 2.5 రేటింగ్ ఇస్తూ కావాలనే సినిమాను, దర్శకుడు సందీప్ ను డౌన్ చేయాలని చూస్తున్నారు. దీంతో తెలుగు ఆడియన్స్ హిందీ మీడియాపై మండిపడుతున్నారు.