
సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘సంబరాల యేటిగట్టు’. రోహిత్ కేపీ దర్శకత్వంలో కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ అప్డేట్ను అందించారు మేకర్స్. మరో వారంలో ప్రారంభమయ్యే అప్ కమింగ్ షెడ్యూల్లో ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఆధ్వర్యంలో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను చిత్రీకరించనున్నట్టు తెలియజేశారు.
ఈ సీన్స్లో పవర్ఫుల్ విలన్ పాత్ర పోషిస్తున్న ఓ బాలీవుడ్ సూపర్స్టార్తో సాయి దుర్గ తేజ్ తలపడనున్నట్టు చెప్పారు. మరోవైపు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా సీజీ వర్క్ కూడా వేగంగా జరుగుతోందని అన్నారు. దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్టుగా నిలుస్తుంది.
ఇందులో తేజ్ రగ్డ్ లుక్లో కనిపించనున్నాడు. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ల, రవికృష్ణ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దసరా సందర్భంగా విడుదల చేయాలని అనుకున్నప్పటికీ ఇండస్ట్రీ సమ్మె కారణంగా రిలీజ్ వాయిదా పడింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ని అనౌన్స్ చేస్తారు. బి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు.