
- రాజ్భవన్తో పాటు సిటీ సివిల్ కోర్టు, జింఖాన్ క్లబ్కు బెదిరింపు మెయిల్
- అంతా ఉత్తదేనని తేల్చిన పోలీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్లో మంగళవారం వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. రాజ్ భవన్తో పాటు సిటీ సివిల్ కోర్టు, జడ్జి చాంబర్స్, సికింద్రాబాద్ జింఖానా క్లబ్ లో నాలుగు ఆర్డీఎక్స్ బాంబులు పెట్టినట్లు జింఖాన్ ఆఫీస్ మెయిల్అడ్రస్కు, సిటీ సివిల్కోర్టు ప్రధాన న్యాయమూర్తి మెయిల్కు బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీంతో కోర్టులో అడ్వకేట్లు, సిబ్బంది, రాజ్భవన్సిబ్బంది ఆందోళన చెందారు. మధ్యాహ్నం 12 గంటలకు సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టినట్లు కోర్టు కు మెయిల్ పంపారు. దీంతో పోలీసులు అడ్వకేట్లు, సిబ్బందిని బయటకు పంపి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు.
ఎక్కడా బాంబులు లేవని గుర్తించడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు రాజ్భవన్కు కూడా బాంబు బెదిరింపు మెయిల్వచ్చింది. పోలీసులు హుటాహుటిన తనిఖీలు చేసి ఎక్కడా బాంబు దొరకలేదని చెప్పారు. కోర్టుకు వచ్చిన మెయిల్లో తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ విద్యార్థులు అని ఉంది. ఆ యూనివర్సిటీలో జరుగుతున్న వ్యవహారాలను అక్కడి పోలీసులు పట్టించుకోవడం లేదని, అందుకే ఇలా చేశామని మెయిల్లో మెన్షన్చేశారు. మెయిల్వచ్చిన 23 నిమిషాల్లో జింఖానా క్లబ్లో బాంబు పేలబోతోందనే బెదిరింపు కూడా ఉంది. దీంతో హైరానా పడిన పోలీసులు తనిఖీలు చేయగా, ఉత్త బెదిరింపే అని తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.