- కోర్టు అఫీషియల్ మెయిల్ కు మెసేజ్?
రాజన్నసిరిసిల్ల/ములుగు, వెలుగు: రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లా కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కోర్టు అఫీషియల్ మెయిల్ కు గుర్తు తెలియని వ్యక్తులు మెసేజ్ పంపగా, సోమవారం ఉదయం సిబ్బంది మెయిల్ ను గమనించి పోలీసులకు సమాచారం అందించారు. కోర్టులో ఉన్న జడ్జిలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది అందరూ బయటకు వెళ్లిపోయారు.
పోలీసులు వెంటనే కోర్టులకు చేరుకొని డాగ్, బాంబ్స్క్వాడ్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. తనిఖీలతో న్యాయవాదులు, కక్షిదారులు ఆందోళనకు గురయ్యారు. రికార్డ్ రూమ్లు, కోర్టు హాళ్లు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు.
తనిఖీల అనంతరం ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో ఫేక్ మెయిల్ అని నిర్ధారణకు వచ్చారు. బాంబు కలకలంతో కోర్టు కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిరిసిల్ల టౌన్ సీఐ శ్రీనివాస్, ములుగు ఎస్సై ఉపేందర్ రావు తెలిపారు.
