ఘనంగా బోనాల వేడుకలు

ఘనంగా బోనాల వేడుకలు

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మి అమ్మవారు, పోచమ్మ ఆలయాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. సింగరేణి కార్మికవాడల్లో అషాఢ మాసం బోనాలు సంబురంగా జరిగాయి. మందమర్రి, కాగజ్​నగర్​లో ఉజ్జయిని మహాంకాళి బోనాలతోపాటు బెల్లంపల్లి పట్టణంలోని 24వ వార్డు అంబేద్కర్ రడగంబాల బస్తీలోని పోచమ్మ తల్లి బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు.

కాగజ్​నగర్ జరిగిన ఉత్సవాల్లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరీశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. కుంటాలలో మహాలక్ష్మి బోనాల పండుగ జోరుగా సాగింది. మహిళలు బోనాలతో ఊరేగింపుగా అమ్మ వారి ఆలయం వరకు వెళ్లారు. నిర్మల్​ సహా తదితర ప్రాంతాల్లో పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు.

వెలుగు, ఫొటోగ్రాఫర్ ఆదిలాబాద్, నిర్మల్​, కాగజ్ నగర్, బెల్లంపల్లి, కుంటాల