బొప్పారం మహిళకు ఉత్తమ రైతు పురస్కారం

బొప్పారం మహిళకు ఉత్తమ రైతు పురస్కారం

బెల్లంపల్లి రూరల్, వెలుగు: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన మహిళా రైతు కర్ణకొండ శ్రావణికి ఉత్తమ రైతు పురస్కారం దక్కింది. వ్యవసాయంలో వినూత్న పద్ధతులు అవలంభిస్తూ అధిక దిగుబడులు సాధించినందుకు గాను సీఆర్​ఐ పంప్స్​ఉత్తమ రైతు పురస్కారాన్ని హైదరాబాద్​లోని రాజీవ్​నగర్​యూనివర్సిటీలో శుక్రవారం మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావుతోపాటు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ అల్దస్​జానయ్య చేతుల మీదుగా అందుకున్నారని తెలిపారు. శ్రావణి దంపతులను బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్​స్రవంతి, శాస్త్రవేత్తలు అభినందించారు.