క్రికెట్‌ మ్యాచ్‌లో ఘర్షణ..బాలుడి మృతి

క్రికెట్‌ మ్యాచ్‌లో ఘర్షణ..బాలుడి మృతి

అమరావతి: అప్పటివరకు వారంతా సరదాగా క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆట మధ్యలో తలెత్తిన చిన్న వివాదం బాలుడి మృతికి కారణమైంది. 14 ఏళ్ల బాలుడిని మరో బాలుడి బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందిన ఘటన కలకలం రేపుతోంది. 

నెల్లూరు లోని జాకీర్ హుస్సేన్ నగర్లో  కొంతమంది బాలురు క్రికెట్ ఆడుతుండగా గొడవపడ్డారు. మాటా మాటా పెరిగి ఫరీద్ (14) అనే బాలుడిని మరో బాలుడు గొంగు, గుండెపై కొట్టడంతో అక్కడికక్కమే కుప్పకూలిపోయాడు. తీవ్రంగా గాయపడిన బాలుడినీ చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దాడికి పాల్పడిన బాలుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.