బ్రైట్‌‌‌‌‌‌‌‌కామ్ గ్రూపు లాభం రూ.321 కోట్లు

బ్రైట్‌‌‌‌‌‌‌‌కామ్ గ్రూపు లాభం రూ.321 కోట్లు

హైదరాబాద్, వెలుగు: ఆన్‌‌‌‌‌‌‌‌లైన్, డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందించే హైదరాబాద్​ కంపెనీ బ్రైట్‌‌‌‌‌‌‌‌కామ్ మొదటి క్వార్టర్​ ఫలితాలను ప్రకటించింది.  కంపెనీకి ఈసారి  రూ. 1690.32 కోట్ల రాబడి వచ్చింది. క్రితం సంవత్సరం జూన్​ క్వార్టర్​లో 1,480.61 కోట్లు వచ్చాయి. 

నికరలాభం రూ.321.47 కోట్లు ఉండగా, గత క్యూ1లో రూ.277.24 కోట్లు వచ్చాయి. కన్సాలిడేటెడ్​ పద్ధతిలో ఆదాయాలు వార్షికంగా14.16 శాతం పెరిగాయి. నికరలాభం 15.96 శాతం పెరిగింది. ఇబిటా 14.49‌‌‌‌‌‌‌‌శాతం పెరిగింది. ఈపీఎస్​ 1.37 నుంచి 1.59కి పెరిగింది. ఆర్​ఓఈ 17.6 శాతం ఉంది. క్యాష్​ఫ్లో విలువ రూ.148 కోట్లని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్​లో తెలిపింది.