హైదరాబాద్, వెలుగు: ఆన్లైన్, డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందించే హైదరాబాద్ కంపెనీ బ్రైట్కామ్ మొదటి క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. కంపెనీకి ఈసారి రూ. 1690.32 కోట్ల రాబడి వచ్చింది. క్రితం సంవత్సరం జూన్ క్వార్టర్లో 1,480.61 కోట్లు వచ్చాయి.
నికరలాభం రూ.321.47 కోట్లు ఉండగా, గత క్యూ1లో రూ.277.24 కోట్లు వచ్చాయి. కన్సాలిడేటెడ్ పద్ధతిలో ఆదాయాలు వార్షికంగా14.16 శాతం పెరిగాయి. నికరలాభం 15.96 శాతం పెరిగింది. ఇబిటా 14.49శాతం పెరిగింది. ఈపీఎస్ 1.37 నుంచి 1.59కి పెరిగింది. ఆర్ఓఈ 17.6 శాతం ఉంది. క్యాష్ఫ్లో విలువ రూ.148 కోట్లని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది.