మరదలిపై బావ అత్యాచారం

మరదలిపై బావ అత్యాచారం

మైనర్ తో పెళ్లి, అత్యాచారం కేసులో బాలిక బావ, మరో వ్యక్తిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. చైతన్యపురి ఇన్ స్పెక్టర్ సుదర్శన్ వివరాల ప్రకారం.. మే1వ తేదీన చైతన్యపురి భవానీనగర్ కు చెందిన బాలిక తండ్రి తనకూతురు కనిపించడం లేదని, తన అక్క కొడుకు శ్రీకాంత్ పై అనుమానం వ్యక్తం చేస్తూ చైతన్యపురి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. అయితే అదేరోజున బాలికకు మాయ మాటలు చెప్పి మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల మండలం, గొల్లపల్లికి చెందిన శ్రీకాంత్(25)(బాలికకు వరుసకు బావ) యాదగిరిగుట్ట తీసుకెళ్లి పెళ్లిచేసుకున్నాడు . అతనికి బాలికకు వరుసకు బాబాయి అయ్యే శంకర్, మరో స్నేహితుడు పురుషోత్తం సహకరించారు.

అనంతరం శ్రీకాంత్ బాలికను గొల్లపల్లికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేశాడు. నిందితుడు శ్రీకాంత్, శంకర్ను చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కుతరలించారు. పురుషోత్తం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల తర్వాత తల్లిదండ్రులకు అప్పగించినట్లు చెప్పారు.