కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కార్పొరేటర్

కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ కార్పొరేటర్

జీడిమెట్ల, వెలుగు: కాంగ్రెస్​పాలనకు బీఆర్ఎస్​నేతలు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని కుత్బుల్లాపూర్​ఇన్​చార్జ్ కొలను హనుమంతరెడ్డి అన్నారు. నిజాంపేట్​కార్పొరేషన్​పరిధిలో బీఆర్​ఎస్​నుంచి బాచుపల్లి కార్పొరేటర్​ కొలను వీరేందర్​రెడ్డి , మాజీ వైస్​ఎంపీపీ కొలను కృష్ణారెడ్డి, మాజీ ఉప సర్పంచ్ సుధీర్​రెడ్డి, కొలను బాల్​రెడ్డి, 18వ వార్డు అధ్యక్షుడు రాజేందర్​తోపాటు పలువురు మంత్రి తుమ్మల నాగేశ్వరావు సమక్షంలో పార్టీలో చేరారు. ​ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారిని ఆయన అభినందించారు. ఎంపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్​ను గెలిపిస్తామన్నారు.