కాంగ్రెస్​లో చేరిన బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు

కాంగ్రెస్​లో చేరిన బీఆర్​ఎస్​ కౌన్సిలర్లు

రామాయంపేట, చేగుంట, వెలుగు:  బీఆర్​ఎస్​ పార్టీకి చెందిన రామాయంపేట మున్సిపల్​ కౌన్సిలర్లు నలుగురు  కాంగ్రెస్​లో  చేరారు. 2 వ వార్డు కౌన్సిలర్ సుందర్ సింగ్, 6వ వార్డు కౌన్సిలర్ దేమే యాదగిరి, 9 వ వార్డు కౌన్సిలర్ దేవుని జయ రాజు, 11 వ వార్డు కౌన్సిలర్ చిలుక గంగాధర్  బుధవారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావ్​ సమక్షంలో కాంగ్రెస్​ కండువాలు కప్పుకున్నారు. 

రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్​ రాజీనామా 

చేగుంట మండలం రెడ్డిపల్లి సొసైటీ చైర్మన్, మండల ముదిరాజ్​ సంఘం అధ్యక్షులు మేకల పరమేశ్​ బుధవారం బీఆర్​ఎస్​ కు రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​  అభ్యర్థి కొత్త ప్రభాకర్​ రెడ్డి గెలుపుకోసం కష్టపడి పనిచేశామన్నారు. కాగా సొసైటీ చైర్మన్​ అయిన తనను ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదన్నారు. ఇటీవల  రామాయపల్లి గెస్ట్ హౌస్ లో జరిగిన చేగుంట మండల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంతో పాటు, మండల పార్టీ అధ్యక్ష ఎన్నిక గురించి తనకు సమాచారం ఇవ్వలేదన్నారు. దీంతో మనస్తాపం చెంది పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు పరమేశ్​ దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్​రెడ్డికి రాసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.