
- బీఆర్ఎస్ నేతలపై కేసులో కౌంటర్ వేయండి
- పోలీసులకు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్, వెలుగు: మంచిర్యాల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సహా 29 మందిపై నమోదైన కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణను వచ్చే నెల 13కి వాయిదా వేస్తూ జస్టిస్ కె.లక్ష్మణ్ ఇటీవల ఆదేశాలిచ్చారు.
బెల్లంపల్లి చౌరస్తా వద్ద నేషనల్ హైవే 363పై పోలీసుల అనుమతి లేకుండా ధర్నా చేశారనే కేసును కొట్టేయాలని దివాకర్ సహా 30 మంది పిటిషన్ వేశారు. పోలీసులు అన్యాయంగా కేసు నమోదు చేశారని. ఘర్షణలో బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారని, ఘర్షణకు కారణమైన కాంగ్రెస్ వర్గాలపై కేసు నమోదు చేయకుండా తమపై కేసు నమోదు చెల్లదని పిటిషనర్ల వాదన. దీనిపై న్యాయమూర్తి, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత–2023 చట్టం కింద పోలీసుల దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. తదుపరి విచారణను జులై 13కి వాయిదా వేశారు.