హైదరాబాద్, వెలుగు: చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు మద్దతుగా శనివారం చేవెళ్లలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. శనివారం సాయంత్రం ఫరా ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో జరగనున్న ఈ సభకు పార్టీ చీఫ్ కేసీఆర్, ముఖ్యనేతలు హాజరు కానున్నారు.
సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, సుమారు 2 లక్షల మంది ఈ సభకు హాజరయ్యేలా జన సమీకరణ చేస్తున్నామని చేవెళ్ల బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ సభకు ప్రజా ఆశీర్వాద సభగా పేరు పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నల్గొండ, కరీంనగర్లో జరిగిన సభల్లో కేసీఆర్ పాల్గొన్నారు. అయితే, ఈ రెండు సభలు లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ముందే జరిగాయి. షెడ్యూల్ వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సభ ఇదే కావడం గమనార్హం.