రైతులకు ఇస్తామన్న బోనస్​.. బోగస్​ గా మారింది: కేసీఆర్​

రైతులకు ఇస్తామన్న బోనస్​.. బోగస్​ గా మారింది: కేసీఆర్​

కాంగ్రెస్​ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాగునీటి సమస్యలు ఏర్పడుతున్నాయని బీఆర్​ఎప్​ అధినేత కేసీఆర్​ అన్నారు.కాంగ్రెస్​ రైతులకు ఇస్తామన్న బోనస్​ .. బోగస్​ గా మారిందన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం  వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామన్నారు.  కాంగ్రెస్​ చేసిన పాపాలకు పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు.  ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్​ ప్రభుత్వం అబద్దాలు చెబుతుందన్నారు.  కనీసం పంట కూడా  ప్రభుత్వం  కొనలేదంటున్నారు.  భూగర్భజలాలు అడుగంటినా.. చెరువులను, చెక్​ డ్యాంలను నింపడం లేదన్నారు. బీఆర్​ఎస్​ హయాంలో చెరువులను లూటీ చేయాల్సి వస్తే.. ఇప్పుడు చెరువులు ఎండిపోతున్నాయన్నారు.  

  బీఆర్​ఎస్​ హయాంలో రూపాయికే నల్లా కనక్షన్​ ఇచ్చామన్నారు.  నాలుగేళ్ల కాంగ్రెస్​ ప్రభుత్వంలో ఇప్పటికే నాలుగున్నర లక్షల ట్యాంకర్లు కొన్నారన్నారు.  కాంగ్రెస్​ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారన్నారు.  కేసీఆర్ దిగిపోయినా తరువాత కరంట్​ కష్టాలు వచ్చాయన్నారు.  పేదల బాధలు పట్టించుకునే నాథుడే లేడని కేసీఆర్​ అన్నారు. మళ్లీ అతిసార వ్యాధి విజృభించే అవకాశం ఉందని కేసీఆర్​ తెలిపారు.  రాష్ట్రాభివృద్దిపై కాంగ్రెస్​ దృష్టి సారించడంలేదన్నారు.  

బీఆర్​ఎస్​ పాలనలో నీటి ట్యాంకర్ల ఊసేలేదన్నారు.  హైదరాబాద్​ లో నీళ్ల ట్యాంకర్ల అవసరం లేకుండా చేశామన్నారు.  రైతుబంద్​ పథకాన్ని కూడా అమలు చేయడంలో కాంగ్రెస్​ ప్రభుత్వం విఫలమైందన్నారు.   కాంగ్రెస్​ ప్రభుత్వంలో పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు.  గతంలో చాలా మంచిగా నడుస్తున్న వ్యవస్థలను కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు.