
- మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నదని బీఆర్ఎస్వర్కింగ్ప్రెసిడెంట్కేటీఆర్ ఆరోపించారు. రేవంత్ సర్కార్ పతనం మొదలైందని శుక్రవారం ఓ ప్రకటనలో దుయ్యబట్టారు. ‘‘పరిపాలన అంటే ఏంటో తెలియని అసమర్థులు రాజ్యమేలడం వల్లే రైతులకు కష్టాలు, కన్నీళ్లు. కేసీఆర్ నాయకత్వం, ముందుచూపు ఇప్పుడు తెలంగాణ సమాజానికి అర్థమైంది. బూతులు మాట్లాడడం తప్ప చేతలు రాని ఢిల్లీ పార్టీల నాయకులకు.. కేసీఆర్ వందేండ్ల విజన్కు తేడా ప్రజలకు అర్థమైంది” అని పేర్కొన్నారు.