గుండెపోటుతో హుజురాబాద్ బీఆర్ఎస్ నేత కన్నుమూత

గుండెపోటుతో హుజురాబాద్ బీఆర్ఎస్ నేత కన్నుమూత

కరీంనగర్ : హుజురాబాద్ లో బీఆర్ఎస్ నేత నందగిరి మహేందర్ రెడ్డి (39) గుండెపోటుతో మృతిచెందారు. మృతదేహం వద్ద "డాడీ.. లే .. డాడీ" అంటూ తన కొడుకు రోదనలు మిన్నంటాయి. "డాడీని లెమ్మని చెప్పు" అని పక్క వాళ్లను అడుగుతూ ఏడుస్తున్న బాలుడిని చూసి అక్కడున్న వారందరూ కూడా కన్నీరు పెట్టుకున్నారు. 

నందగిరి మహేందర్ రెడ్డి కుటుంబం సైదాపూర్ మండలం రాయికల్ నుంచి వచ్చి చాలా కాలంగా హుజురాబాద్ లో నివాసం ఉంటోంది. గతంలో హుజురాబాద్ పట్టణం బీజేపీ అధ్యక్షుడుగానూ మహేందర్ రెడ్డి పని చేశారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.