
గచ్చిబౌలి, వెలుగు: శేరిలింగంపల్లి సెగ్మెంట్ను ఎంతో అభివృద్ధి చేశానని.. మరోసారి తనను గెలిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అరికెపూడి గాంధీ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గచ్చిబౌలి డివిజన్లోని గోపన్ పల్లి, వీకర్ సెక్షన్ కాలనీ, మాదాపూర్ డివిజన్లోని గోకుల్ ఫ్లాట్స్లో ఇంటింటికి తిరుగుతూ ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అరికెపూడి గాంధీ మాట్లాడుతూ.. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేయాలన్నారు.
రాష్ట్రంలో మరోసారి బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని.. ప్రతిపక్షాలకు డిపాజిట్లు కూడా రావని ఆయన తెలిపారు. శేరిలింగంపల్లిలో రూ.కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.