ఎమ్మెల్యే దానం నాగేందర్ కు వరద బాధితుల నుంచి ఎదురీత

ఎమ్మెల్యే దానం నాగేందర్ కు వరద బాధితుల నుంచి ఎదురీత

హైదరాబాద్ : ఖైరతాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు చేదు అనుభవం ఎదురైంది. హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 14లోని ఆదర్శ్ బస్తీలో పర్యటించిన ఆయన్ను.. ఇప్పుడు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు బస్తీ ప్రజలు. గత 10 రోజులుగా వరద నీళ్లలోనే ఉంటున్న తమను పరామర్శించడానికి రాకుండా... ఇప్పుడు ఎందుకు వచ్చారని నిలదీశారు. దీంతో ఆదర్శ్ నగర్ బస్తీ ప్రజలకు క్షమాపణలు కోరారు ఎమ్మెల్యే దానం నాగేందర్.

బస్తీల్లో నిలిచిపోయిన నీళ్లను వెంటనే తొలగించాలని జీహెచ్ఎంజీ అధికారులకు ఫోన్ చేసి ఆదేశించారు ఎమ్మెల్యే దానం. నాలా రీటర్నింగ్ వాల్ నిర్మాణం పనులు జరుగుతున్న క్రమంలో నీళ్లు బస్తీలోకి రాకుండా తాత్కాలిక గోడను నిర్మించాలని అధికారులకు సూచించారు. వరద నీటిలో ఉన్న ఇండ్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నష్టపరిహారం ఇవ్వాలని బస్తీవాసులు కోరారు. 30 కుటుంబాలకు రూ.20 వేల చొప్పున అందిస్తానని ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు.