కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కన్నుమూత

కంటోన్మెంట్ ఎమ్మెల్యే  సాయన్న కన్నుమూత

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొన్ని రోజులుగా  కిడ్నీ సమస్యతో  బాధపడుతున్న ఆయన ఈ నెల 16 నుంచి  యశోద ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ ఇవాళ చనిపోయారు. సాయన్న రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కంటోన్మెంట్ నుంచి  సాయన్న ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ నుంచి నాలుగు సార్లు గెలవగా.. 2018లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.  ఆయన కుటుంబ సభ్యులు యశోద ఆస్పత్రికి చేరుకుంటున్నారు. సాయన్న మృతిపట్ల పలువురు బీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.