కారు గుర్తుకు ఓటేస్తే..కేసీఆర్‍కు ఓటేసినట్లే : కేటీఆర్‍

కారు గుర్తుకు ఓటేస్తే..కేసీఆర్‍కు ఓటేసినట్లే :  కేటీఆర్‍
  • బీఆర్‍ఎస్‍ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ కేటీఆర్‍ 

నర్సంపేట/ వర్ధన్నపేట/ మహబూబాబాద్/ తొర్రూరు, వెలుగు: మున్సిపల్‍ ఎన్నికల్లో జనాలు 'కారు గుర్తుకు ఓటేస్తే.. కేసీఆర్‍కు ఓటేసినట్లేనని' బీఆర్‍ఎస్‍ వర్కింగ్‍ ప్రెసిడెంట్‍ కేటీఆర్‍ అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఆదివారం వరంగల్​ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట, మహబూబాబాద్​ జిల్లా తొర్రూరులో రోడ్‍ షో నిర్వహించి మాట్లాడారు. సీఎం రేవంత్‍రెడ్డి ఎన్కటి రోజులు తెస్తా అని జనాలను నట్టేట ముంచాడని ఆరోపించారు.

ఆరుగ్యారెంటీలు అమలు చేయడంలో ప్రభుత్వం అట్టర్​ప్లాప్​ అయ్యిందన్నారు. యూరియా కోసం రైతులు గోస పడుతున్నారని, ప్రజలు పాలిచ్చే బర్రెను విడిచి తన్నె బర్రెను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. మున్సిపల్‍ ఎన్నికల్లో పోసపోవద్దని, ఆగం కావద్దని అంటూ ఎవరికి ఓటేస్తే ఏంవస్తుందో ఆలోచించాలని చెప్పారు. ఆయా రోడ్డు షోలలో కేటీఆర్​ వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‍రెడ్డి, నన్నపనేని నరేందర్, దాస్యం వినయ్​ భాస్కర్,​​ ఆరూరి రమేశ్‍ తదితరులు పాల్గొన్నారు.