భారత జలాల్లోకి పాక్ జాలర్లు

భారత జలాల్లోకి పాక్ జాలర్లు

భారత జలాల్లోకి ప్రవేశించిన పాక్ జాలర్లలో ఒకరిని బీఎస్ఎఫ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ లోని సర్ సిక్రీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కొందరు పాక్ జాలర్లు భారత తీర ప్రాంతంలోకి వచ్చిన విషయాన్ని గమనించిన జవాన్లు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ ప్రాంతమంతా బురదగా ఉండటంతో ఒకరు మినహా మిగతా మత్స్యకారులంతా పారిపోయారు. వారు వచ్చిన మూడు బోట్లను సీజ్ చేసినట్లు గుజరాత్ బీఎస్ఎఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ప్రకటించారు. పట్టుబడ్డ జాలరిని ప్రశ్నిస్తున్నారు.

For more news..

రాష్ట్రంలో కొత్తగా 2,861 కరోనా కేసులు

ర్యాలీలు, రోడ్ షోలపై నిషేధం పొడగింపు